ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సత్యం సుందరం”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సత్యం సుందరం”

Published on Oct 25, 2024 7:06 AM IST


రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన పలు క్లీన్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో కోలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం “సత్యం సుందరం” కూడా ఒకటి. కార్తీ అలాగే అరవింద స్వామి కాంబినేషన్ లో 96 సినిమా ఫేమ్ సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇపుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఇందులో పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు తప్పకుండా చూడొచ్చు. మరి ఈ సినిమాని సూర్య, జ్యోతికలు నిర్మాణం వహించగా తెలుగులో ఆసియన్ సురేష్ వారు విడుదల చేసారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు