ఓటిటిలో వచ్చాక “సత్యం సుందరం” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్


ఇటీవల కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన ఫీల్ గుడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కార్తీ మరియు అరవింద స్వామి కాంబినేషన్ లో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం “సత్యం సుందరం” అని చెప్పాలి. మరి ఈ చిత్రం అప్పుడు థియేటర్స్ లో చూసిన తెలుగు సహా తమిళ్ ఆడియెన్స్ కి ఎంతో నచ్చింది.

అయితే ఈ సినిమా జస్ట్ కొన్ని రోజులు కితమే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడ వచ్చాక ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియెన్స్ కోసం తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకోవడం విశేషం.

సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాలో కొన్ని పర్టిక్యులర్ సీన్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అలాగే కార్తీ ఎమోషనల్ పెర్ఫామెన్స్, అరవింద స్వామిపై కూడా తన చెల్లెలిపై పెళ్లి ఎపిసోడ్ సీన్ కోసం కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా మొత్తంగా మాత్రం ఓటిటిలో వచ్చాక ఈ సినిమాకి మరింత అప్లాజ్ దక్కుతుంది అని చెప్పాలి.

Exit mobile version