ఇంట్రెస్టింగ్ గా “సత్యం సుందరం” టీజర్!

ఇంట్రెస్టింగ్ గా “సత్యం సుందరం” టీజర్!

Published on Sep 13, 2024 5:04 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సత్యం సుందరం (మెయియాజగన్) సెప్టెంబర్ 28 వ తేదీన తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు. అందులో భాగంగా నేడు తెలుగు టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కార్తీ మరియు అరవింద్ స్వామిలు ఇద్దరూ టీజర్ లో అలరించారు. హీరో కార్తీ, అరవింద్ స్వామి ను బావా అంటూ పిలుస్తూ, ఫన్ జెనరేట్ చేశారు. ఈ చిత్రం టీజర్ ను చూస్తుంటే, ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక మరియు సూర్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించాడు. రాజ్ కిరణ్, శ్రీ దివ్య కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు