350కి పైగా స్క్రీన్స్‌లో ‘సత్యం సుందరం’ రిలీజ్

350కి పైగా స్క్రీన్స్‌లో ‘సత్యం సుందరం’ రిలీజ్

Published on Sep 28, 2024 1:30 AM IST

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ‘దేవర’ రిలీజ్ కారణంగా ఓ రోజు వెనక్కి జరిగి తెలుగులో మంచి బజ్‌తో రిలీజ్‌కు రెడీ అయ్యింది ఈ సినిమా. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. దీనికితోడు ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మంచి నెంబర్స్‌తో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో ఏకంగా 350కి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఓ పక్క ‘దేవర’ మేనియాతో చాలావరకు థియేటర్లు మాస్‌తో సందడి చేస్తుంటే, ఈ క్లాస్ మూవీ కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా నటిస్తుండటంతో ఈ మూవీని చూసేందుకు క్లాస్ ఆడియెన్స్ ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు