‘సీతన్నపేట గేట్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – నిర్మాత ఆర్ శ్రీనివాస్

‘సీతన్నపేట గేట్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – నిర్మాత ఆర్ శ్రీనివాస్

Published on Mar 25, 2025 8:55 AM IST

వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీతన్నపేట గేట్”. ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో రూపొందిన “సీతన్నపేట గేట్” సినిమా ఏప్రిల్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మన సమాజంలో చాలా వరకు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇవి అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సీతన్నపేట గేట్ సినిమాను రూపొందించాను. తెలుగు, కన్నడలో స్టార్ హీరోస్ తో సినిమాలు రూపొందించిన ఆర్ఎస్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థలో నేను మూవీ చేయడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్స్ తో సీతన్నపేట గేట్ సినిమా కథనం సాగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.

అతిథిగా వచ్చిన దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ‘ఆర్ఎస్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద సంస్థ. ఎన్టీఆర్ తో సుబ్బు సినిమాను, నా దర్శకత్వంలో అనుష్క, శ్రీహరి, సుమంత్ కాస్టింగ్ తో మహానంది మూవీ చేశారు. నిర్మాత శ్రీనివాస్ గారు ఎన్నో మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. కన్నడలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు. అలాంటి సంస్థ నుంచి సీతన్నపేట గేట్ సినిమా వస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ కు సరిపోయేలా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. సీతన్నపేట గేట్ సినిమా దర్శకుడు రాజ్ కుమార్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘సినిమాలకు పెద్దా చిన్నా అనేది లేదు. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ లేని సినిమా వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినా అది ప్రేక్షకులకు నచ్చదు. కథ బాగున్న చిన్న సినిమాలు కూడా ఆదరణ పొందుతాయి. ఇప్పుడు థియేటర్స్ కు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు అంటున్నారు. కానీ ఇప్పటికీ సగటు మధ్య తరగతి, పేద వారికి సినిమానే చవకైన వినోదం. నేను డిస్ట్రిబ్యూటర్ గా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్..ఇలా అందరి స్టార్స్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎన్టీఆర్ తో సుబ్బు, సముద్ర గారితో మహానంది మూవీస్ నిర్మించాను. కన్నడలో స్టార్ హీరోస్ తో పలు చిత్రాలు నిర్మించాను. సీతన్నపేట గేట్ సినిమా కథ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు చెప్పగానే ఆకట్టుకుంది. మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఇవాళ్టి సొసైటీలో జరుగుతున్న ఘటనలకు ప్రతిరూపంగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సీతన్నపేట గేట్ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.

హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సీతన్నపేట గేట్ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్, మా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చాలా మాస్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ తో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవుతానని ఆశిస్తున్నా. ఏప్రిల్ 4న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు