విషాదం : ప్రముఖ నటుడు మృతి

విషాదం : ప్రముఖ నటుడు మృతి

Published on Dec 18, 2023 1:17 PM IST

భోజ్‌పురి చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు బ్రిజేష్ త్రిపాఠి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయనకు, ముంబైలోని తన నివాసంలో నిన్న రాత్రి సడెన్ గా గుండెపోటు వచ్చింది. బ్రిజేష్ త్రిపాఠిను హుటాహుటీన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐతే, అక్కడ బ్రిజేష్ త్రిపాఠి చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు ధృవవీకరించారు. దీంతో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

బ్రిజేష్ త్రిపాఠి 1979లో సాయా తోహరే కరణ్ అనే సినిమాతో అరంగేట్రం చేసి, తనకంటూ ఓ మంచి పేరును సంపాదించుకున్నారు. బ్రిజేష్ త్రిపాఠి మృతి పట్ల భోజ్‌పురి పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ త్రిపాఠి గొప్ప విలక్షణ నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని అక్కడి సినీ అభిమానులు వేడుకుంటున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున బ్రిజేష్ త్రిపాఠి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు