ఆ హిట్ సీక్వెల్ లేనట్టే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

టాలీవుడ్‌లో ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, దానికి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే, గతంలో వచ్చిన ‘ఢీ’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే, ఎప్పట్నుంచో ఈ సినిమా సీక్వెల్‌పై ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. శ్రీను వైట్ల ఓకే అంటే ఢీ సీక్వెల్ చేస్తానని మంచు విష్ణు చాలాసార్లు చెప్పాడు. కానీ, ఇప్పుడు ఈ సీక్వెల్ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మంచు విష్ణు కూడా ఈ సీక్వెల్ మూవీని లైట్ తీసుకున్నాడు. అయితే, శ్రీను వైట్లతో మాత్రం ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని అంటున్నాడు.

ఇక ఇప్పుడు శ్రీను వైట్ల కూడా ఇదే విషయాన్ని క్లారిఫై చేశాడు. ‘ఢీ’ సినిమాలో శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి వంటి స్టార్స్ నటించారు. ఇప్పుడు వారిని రీప్లేస్ చేయడం కష్టమని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో ‘ఢీ’ లాంటి హిట్ మూవీ సీక్వెల్ ఇక లేనట్టే అని అందరూ డిసైడ్ అవుతున్నారు.

Exit mobile version