ఆ కాపీ సీన్స్ చూసి షాకయ్యా – శంకర్‌

ఆ కాపీ సీన్స్ చూసి షాకయ్యా – శంకర్‌

Published on Sep 22, 2024 6:00 PM IST

స్టార్ దర్శకుడు శంకర్‌ సోషల్‌ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్‌ పెట్టారు. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను తన అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ లో శంకర్ ఏం రాసుకొచ్చారంటే..‘వెంకటేశన్‌ రాసిన ఐకానిక్‌ తమిళ నవల ‘నవ యుగ నాయగన్‌ వేళ్‌ పారి’ కాపీరైట్స్‌ నావే. అయితే, నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యాను’ అని శంకర్ తెలిపారు.

తన పోస్ట్ శంకర్ ఇంకా రాసుకొస్తూ.. ‘నవలలోని ముఖ్యమైన సీన్‌ను.. ఓ లేటెస్ట్‌ మూవీ ట్రైలర్‌లో చూసి కలత చెందాను. నవలలోని సీన్స్‌ను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అంటూ శంకర్ హెచ్చరించారు. ప్రస్తుతం శంకర్‌ రామ్‌ చరణ్‌ హీరోగా వస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు