“ఇండియన్ 2, 3” లలో మెయిన్ పాయింట్ ఇదే – శంకర్


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా యంగ్ హీరో సిద్ధార్థ్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇంకా కాజల్ అగర్వాల్ (Kajal) తదితరులు నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఇండియన్ 2”. మరి 1996 లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా ఈ సినిమా ఇప్పుడు వస్తుండగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలా నమ్మకంగా శంకర్ ఒకటి కాదు రెండు సీక్వెల్ లను చేసేసారు.

మరి వీటిలో ఇప్పుడు ఇండియన్ 2 రాబోతుండగా దీని తర్వాత ఇండియన్ 3 రానుంది. ఇక ఇదిలా ఉండగా అసలు ఈ రెండు సినిమాల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అనేది శంకర్ తాజాగా రివీల్ చేశారు. అప్పుడు 1996 నుంచి ఇపుడు వరకు భారతదేశంలో జరిగిన అవినీతి, కుంభకోణాలు ఆధారంగా తెరకెక్కించమని రివీల్ చేశారు. మరి ఏయే పాయింట్స్ ఎలాంటి సెన్సేషన్ కేసుల్ని టచ్ చేసారో అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే అని చెప్పాలి.

Exit mobile version