ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘సింబా’

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘సింబా’

Published on Sep 4, 2024 8:30 PM IST

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన సై ఫై మూవీ ‘సింబా’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఈ సినిమాను మురళీ మనోహర్ రెడ్డి డైరెక్ట్ చేయగా జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

అయితే, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ చేశారు. మరి ఓటీటీ ఆడియెన్స్‌ని ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు