తెలుగు ఆడియెన్స్ ప్రేమ కోసం ఎస్ జే సూర్య షూటింగ్ వదులుకుని తన ఖర్చులే పెట్టికొని మరీ..

తెలుగు ఆడియెన్స్ ప్రేమ కోసం ఎస్ జే సూర్య షూటింగ్ వదులుకుని తన ఖర్చులే పెట్టికొని మరీ..

Published on Sep 6, 2024 8:01 AM IST

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర విలన్ రోల్స్ కి కేరాఫ్ గా మారుతున్న వన్ అండ్ ఓన్లీ వెర్సటైల్ నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎస్ జే సూర్యనే అని చెప్పాలి. తమిళ్ లో ఎన్నో ఐకానిక్ రోల్స్ చేసిన ఎస్ జే సూర్య మన టాలీవుడ్ లో విలన్ గా చేసిన మొదటి సినిమానే “సరిపోదా శనివారం”. ఈ సినిమాలో దయాగా కనిపించిన తను ఓ రేంజ్ విలనిజాన్ని పండించి తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరైపోయారు.

మరి నిన్న నాని 16 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, సినిమా సక్సెస్ మీట్ కూడా ఒకేసారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ జే సూర్య స్పీచ్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఈవెంట్ కి కేవలం తెలుగు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పడానికి వారి ప్రేమ ఎంజాయ్ చేసేందుకే షూటింగ్ ఆపుకొని మరీ వచ్చానని తెలిపారు.

ఈరోజు మధురైలో ఓ సినిమా కీలక షూటింగ్ అందరి ఆర్టిస్ట్ లతో కలిసి ఉంటే సరిపోదా శనివారం ఈవెంట్ కి రావాలని ఆ షూట్ ఆపించి మరీ వచ్చాను అని నిర్మాతకి తన వల్ల ఆరోజు షూటింగ్ ఆగింది కాబట్టి తనే ఆరోజు ప్రతి ఒక్కరి ఖర్చు పెట్టుకుంటానని చెప్పి కేవలం తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ప్రేమ కోసం వచ్చేసాను అని ఎస్ జే సూర్య తెలిపారు. దీనితో తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న ఆదరణకు తను ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు