శ్రీదేవి చిన్న కూతురు కూడా ఎంట్రీ ఇస్తోందట !

శ్రీదేవి చిన్న కూతురు కూడా ఎంట్రీ ఇస్తోందట !

Published on Mar 7, 2021 12:18 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక తన అక్క స్టార్ డమ్ ను చూసిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అక్క బాటలోనే తానూ నటిగా అరంగేట్రం చేయడానికి ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ లోని ఫేమస్ లీ స్ట్రాస్బెర్గ్ ఇనిస్టిట్యూట్ లో నటన నేర్చుకుని వచ్చిందట ఖుషి.

అక్కడ ఏడాది కోర్సు పూర్తి చేసి వచ్చిందని.. త్వరలోనే సినిమాల్లో నటిస్తుందని.. అలాగే అందం పై కూడా ఆమె దృష్టి పెట్టిందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 2022లో ఖుషీ కపూర్ యాక్టింగ్ డెబ్యూ ఉంటుంది అన్నమాట. మరి జాన్వీ కపూర్ ని కరణ్ జోహార్ హీరోయిన్ గా లాంచ్ చేశాడు కాబట్టి, ఆమె చెల్లెల్ని కూడా అతనే లాంచ్ చేస్తాడేమో చూడాలి. మరోపక్క బోనీ కపూర్ తన కూతుళ్లతో సినిమాలు తీసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు