తండేల్: చైతూ కి గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసిన శ్రీకాకుళం ఫ్యాన్స్!

టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తదుపరి చిత్రం తండేల్. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటి నెలకొంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. శ్రీకాకుళంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు మేకర్స్. అయితే నాగ చైతన్యకి శ్రీకాకుళం ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసారు. సాండ్ ఆర్ట్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తండేల్ నిజమైన జాతర అంటూ ఫ్యాన్స్ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాక్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్లు జైల్లో ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version