“విశ్వం” రెస్పాన్స్ పై శ్రీను వైట్ల పోస్ట్ వైరల్

ఈ దసరా కానుకగా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “విశ్వం” కూడా ఒకటి. మరి మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో చేసిన ఈ మొదటి సినిమా శ్రీను వైట్ల నుంచి చాలా కాలం తర్వాత మంచి ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా దసరా బరిలో బాగానే బుకింగ్స్ సొంతం చేసుకుంటూ డీసెంట్ రన్ ని కొనసాగిస్తుంది.

దీనితో శ్రీను వైట్లకి కూడా కొంచెం బూస్టప్ రాగా తాను పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. నైజాంలో ఫేమస్ సింగిల్ స్క్రీన్ భ్రమరాంబలో ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉందని నా రెండేళ్ల కష్టానికి దక్కిన ఫలితం ఎంతో స్పెషల్ దీనిని అందించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version