SSMB29 మూవీ అప్డేట్ అడిగే వారికి రాజమౌళి సమాధానం ఇదే!

SSMB29 మూవీ అప్డేట్ అడిగే వారికి రాజమౌళి సమాధానం ఇదే!

Published on Sep 11, 2024 11:01 PM IST

రౌద్రం రణం రుధిరం (RRR) చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. ఈ చిత్రం అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీ సింహ ప్రధాన పాత్రలో, దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం సెప్టెంబర్ 13 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ను థియేటర్ల లో చూడండి అంటూ రాజమౌళి తెలిపాడు.

అయితే మహేష్ బాబు తో తను చేస్తున్న సినిమా అప్డేట్ అడగడం పట్ల రాజమౌళి రియాక్ట్ అయ్యాడు. అప్డేట్ కావాలంటా, అప్డేట్లు అంటూ పెద్ద కర్రతో బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమా కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు