“మత్తు వదలరా 2” రెడ్ కార్పెట్ ప్రీమియర్‌లో టీమ్‌తో రాజమౌళి!


శ్రీ సింహ కోడూరి ప్రధాన పాత్రలో, రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం రెడ్ కార్పెట్ ప్రీమియర్ షో ను కొంతమందికి మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ షోను చిత్ర యూనిట్ తో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి వీక్షిస్తున్నారు. అంతకుముందు చిత్ర యూనిట్ తో రాజమౌళి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రం ఎలా ఉంది అనేది రాజమౌళి త్వరలో వెళ్లడించున్నారు. ఇక ఈ చిత్రంలో సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా లు కీలక పాత్రల్లో నటించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version