SSMB 29 : జక్కన్న మార్క్ మాత్రం మిస్ కాదట

SSMB 29 : జక్కన్న మార్క్ మాత్రం మిస్ కాదట

Published on Jan 24, 2024 8:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇంకా థియేటర్స్ లో ఆడుతోంది. ఇక అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 కోసం ఇప్పటికే సిద్ధం అవుతున్నారు మహేష్. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా రూపొందనున్న ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యయంతో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇది ఇండియానా జోన్స్ మాదిరిగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో గ్రాండ్ అడ్వెంచరస్ మూవీగా రూపొందనున్నట్లు తెలిపారు. అయితే విషయం ఏమిటంటే, హాలీవుడ్ రేంజ్ టెక్నీకల్ అంశాలతో రూపొందనున్నప్పటికీ జక్కన్న రాజమౌళి మార్క్ ఎలివేషన్స్, ఎమోషనల్ అంశాలు మాత్రం మిస్ కావట. మరి ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు