పట్టాలెక్కిన స్టార్ బాయ్ రొమాంటిక్ ప్రాజెక్ట్ “తెలుసు కదా”

పట్టాలెక్కిన స్టార్ బాయ్ రొమాంటిక్ ప్రాజెక్ట్ “తెలుసు కదా”

Published on Aug 6, 2024 11:11 AM IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తన లాస్ట్ రెండు సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ చిత్రాలు తర్వాత మరో రెండు సినిమాలు టిల్లు క్యూబ్ కాకుండా చేస్తున్నాడు. మరి వాటిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు షూటింగ్ షురూ చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో చేస్తున్న మొట్టమొదటి సినిమానే “తెలుసు కదా”.

మరి అనౌన్స్ చేసిన నాటి నుంచే డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ని అయితే మొదలు పెట్టుకున్నట్టుగా మేకర్స్ అప్డేట్ ని అందించారు. షూటింగ్ నిన్నటి నుంచే మొదలు కాగా ఈ షెడ్యూల్ సుమారు 30 రోజులు పాటుగా కొనసాగనుంది. అలాగే ఈ చిత్రంలో రాశి ఖన్నా అలాగే కేజీయఫ్ చిత్రాల నటి శ్రీనిధి శెట్టి ఇద్దరు కలిసి నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు