నయనతార సినిమాకు స్టార్ డైరెక్టర్ ఫిక్స్..!

నయనతార సినిమాకు స్టార్ డైరెక్టర్ ఫిక్స్..!

Published on Sep 17, 2024 2:01 AM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ్‌లో నటించిన ‘మూకుత్తి అమ్మన్’ ప్రేక్షకులను అలరించడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా, ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందించారు. ఈ సినిమాలో అమ్మోరు పాత్రలో నయనతార నటించగా ఆర్జే బాలాజి ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే, ఈ సీక్వెల్ మూవీకి దర్శకుడిగా స్టార్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. తమిళ స్టార్ డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొంటున్నాయి. నయనతారను మరోసారి అమ్మోరు పాత్రలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాను వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు