కరోనా వైరస్ ప్రభావం తగ్గించే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే దీనిపై అవగాహన తెచ్చే పనిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నిర్వహించారు. అలాగే సోషల్ లైఫ్ కి దూరంగా ఉండాలని వారు హితవు పలకడం జరిగింది.
కాగా ప్రజారోగ్యం కాంక్షిస్తూ, టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు స్వీయ నిర్బధం విధించుకున్నారు. వారు నేడు ఇంటిలో నుండి బయటికి వచ్చేది లేదని శబదం చేశారు. ప్రజా సంక్షేమం కోసం మన హీరోలు స్పందిస్తున్న తీరుకు వారి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.