550 నాటౌట్…బాక్సాఫీస్ వద్ద “స్త్రీ – 2” సెన్సేషన్!

550 నాటౌట్…బాక్సాఫీస్ వద్ద “స్త్రీ – 2” సెన్సేషన్!

Published on Sep 10, 2024 12:09 AM IST


శ్రద్ధా కపూర్ మరియు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో, దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ స్త్రీ – 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు పూర్తి అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం ఇండియాలో నిన్న మరో 11.40 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ 551.44 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

2018 లో రిలీజ్ అయిన స్త్రీ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మడ్డోక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రం బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు