సెన్సేషన్: 500 కోట్ల క్లబ్ లోకి “స్త్రీ-2”

సెన్సేషన్: 500 కోట్ల క్లబ్ లోకి “స్త్రీ-2”

Published on Sep 2, 2024 10:12 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో, దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హార్రర్ మూవీ స్త్రీ-2. ఈ చిత్రం 2018 లో రిలీజైన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఆగస్టు 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఆదివారం రోజున 22.10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో మూడో వారాంతం 48.75 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే ఈ చిత్రం బాహుబలి 2 (42.55 కోట్లు)మూడో వారాంతం రికార్డును బ్రేక్ చేసింది.

ఈ చిత్రం ఇప్పటి వరకూ హిందీ బాక్సాఫీస్ వద్ద 502 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 18 రోజుల్లో 500 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పటి వరకూ జవాన్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2, అనిమల్ చిత్రాలు మాత్రమే హిందీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల క్లబ్ లో ఉన్నాయి. ఈ చిత్రం 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం పట్ల అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక హిందీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ రికార్డు ను బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు