రాయన్: విజయవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకున్న సందీప్ కిషన్!

రాయన్: విజయవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకున్న సందీప్ కిషన్!

Published on Jul 25, 2024 10:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో చివరిసారిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకి వచ్చారు. ఈ చిత్రం ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. అయితే తెలుగు లో మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు హీరో ధనుష్ నటించిన రాయన్ చిత్రంలో కూడా సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

చిత్రం రిలీజ్ సందర్భంగా హీరో సందీప్ కిషన్ విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులతో సెల్ఫీలు కూడా దిగారు సందీప్.
ధనుష్ యొక్క 50 వ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కూడా హీరో ధనుష్ వ్యవహరిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు