“కంగువా” స్టోరీ లీక్ చేసిన సూర్య..


ప్రస్తుతం కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూర్య నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కంగువా” అనే చెప్పాలి. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అయితే ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా స్టోరీపై సూర్య చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ సినిమా యుద్ధం కోసమో కత్తుల కోసమో కాదు క్షమాపణ, శాంతి కోసం తాను పేర్కొన్నాడు.

అలాగే అన్నిటికంటే ఆ అనుభూతే ఎంతో గొప్పది అని నేను అనుకుంటాను అని తెలిపాడు. మరి కంగువా కూడా ఇదే కోణంలో 700 ఏళ్ళు కితం 5 దీవులకు చెందిన తెగల నడుమ జరిగిన పోరాటమే అన్నట్టుగా తాను తెలిపాడు. దీనితో ఈ సినిమా లైన్ ఇపుడు మరింత ఆసక్తి రేపింది. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా రానున్న నవంబర్ 14న రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version