వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సూర్య కొత్త చిత్రం!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సూర్య కొత్త చిత్రం!

Published on Jun 5, 2022 11:00 PM IST


సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఈటీ. ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రం లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఈ చిత్రం జూన్ 12, 2022 న సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను ఏ తరహాలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు