గద్దర్ అవార్డుల కోసం కమిటీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం

గద్దర్ అవార్డుల కోసం కమిటీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం

Published on Aug 23, 2024 1:09 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల విషయం పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఈ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.గద్దర్ అవార్డుల కోసం లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను రూపొందించనున్న కమిటీ సభ్యులు. గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్ గా దిల్ రాజు లు బాధ్యతలు నిర్వహించనున్నారు.

గద్దర్ అవార్డుల కమిటీ సలహాదారులుగా కె.రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరిణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్,
నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు లు వ్యవహరించనున్నారు. ఈ కమిటీ ను నియమించడం పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు