ఎనభై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న “తెలిసినవాళ్ళు”

ఎనభై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న “తెలిసినవాళ్ళు”

Published on Mar 8, 2021 12:00 PM IST

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంతే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ నటిస్తున్నారు.

ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు