ఫస్ట్ షెడ్యూల్ ముగించుకున్న ‘తెలుసు కదా’

ఫస్ట్ షెడ్యూల్ ముగించుకున్న ‘తెలుసు కదా’

Published on Sep 14, 2024 8:00 PM IST

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తెలుసు కదా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్ర తొలి షెడ్యూల్ దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఫస్ట్ షెడ్యూల్ ముగిసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయినట్లుగా వారు తెలిపారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్‌ని కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ చాలా కూల్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు