మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి క్రైమ్ థ్రిల్లర్ “టెనెంట్”

మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి క్రైమ్ థ్రిల్లర్ “టెనెంట్”

Published on Jun 25, 2024 6:30 PM IST

టాలీవుడ్ నటుడు, కమెడియన్ సత్యం రాజేష్ ఇటీవల టెనెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియోలోకి ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా రానుంది.

జూన్ 28, 2024 నుండి ఆహా వీడియోలో కూడా ఈ చిత్రాన్ని చూడవచ్చు. వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, ఎస్తేర్, ఆడుకలం నరేన్, చందు మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాహిత్య సాగర్ ఈ చిత్రంకి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు