పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చే కృషి చేయాలి అంటున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్

పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చే కృషి చేయాలి అంటున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్

Published on Sep 11, 2024 3:48 PM IST

ఇటీవల ప్యారిస్ లో ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్ జరిగిన సంగతి తెలిసిందే. మరి వీటిలో పారా ఒలింపిక్స్ లో మన దేశం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారు పథకాలు గెలిచి త్రివర్ణ పతాకం గౌరవాన్ని పెంచారు. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు.

సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్ కృతజ్ఞతలు తెలిపారు. పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని నిర్మాత విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. థండర్ బోల్ట్స్ అధినేత ఫణి చిట్నేని మాట్లాడుతూ.. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని, భారతీయులకు భావోద్వేగమని వ్యాఖ్యానించారు.

అలాగే ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా, వాషింగ్టన్ సెనేటర్ డెరిక్, హౌస్ రిప్రజెంటేటివ్ వందన స్లేటర్, భాస్కర్ గంగిపాముల, రామ్ పాలూరి, విక్రమ్ గార్లపాటి, రవీందర్ రెడ్డి సాధు, జైపాల్ రెడ్డి, రవీంద్ర గురం, సుబ్బారావు కలగర, సుబ్బు కందకట్టు, వెంకట్ చిలకల, వెంకట్ చిలకలపాటి, అశోక్ గల్లా, నంద గాజుల తదితరులు ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు