జార్జియాలో మొదలుపెట్టిన విజయ్

జార్జియాలో మొదలుపెట్టిన విజయ్

Published on Apr 10, 2021 2:00 AM IST

‘మాస్టర్’ సినిమా విజయం తర్వాత తలపతి విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లారు. ఈరోజు నుండే జార్జియాలో షూటింగ్ ఆరంభమైంది.

ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన ఫైట్స్, సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 3 కోట్ల పారితోషకం తీసుకుంటోంది. ఇక ప్రతినాయకుడిగా పాతవారిని కాకుండా కొత్తవారిని తీసుకునే యోచనలో ఉన్నారు మేకర్స్.
ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుద్ సంగీతం అందివ్వనుండగా మనోజ్ పరమహంస డీవోపీ చేయనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు