సెన్సార్ ముగించుకున్న ‘తండేల్’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ వచ్చే వారం రిలీజ్‌కు రానుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ నేపథ్యంలో ఓ చక్కటి లవ్ స్టోరీ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఈ చిత్రానికి టైటిల్ కార్డ్స్, యాడ్స్ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version