చైతూ, సాయి పల్లవి లకు శ్రీకాకుళం ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్!

నాగ చైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఇది అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి, భారతదేశానికి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు యొక్క నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ శ్రీకాకుళం చేరుకుంది.

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లకు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలివచ్చారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంను GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 20, 2024న విడుదల థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version