సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చైతూ…తండేల్ టీమ్ సెలబ్రేషన్స్!

సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చైతూ…తండేల్ టీమ్ సెలబ్రేషన్స్!

Published on Sep 6, 2024 11:11 PM IST


అక్కినేని నాగ చైతన్య జోష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విభిన్న చిత్రాలతో, విభిన్న పాత్రలతో అలరించాడు. తదుపరి దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ చిత్రంలో కనిపించనున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

చైతూ తెలుగు సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో తండేల్ టీమ్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. తండేల్ మూవీ సెట్స్ లో ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. నాగ చైతన్య కేక్ కట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ తండేల్ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు