హ్యాట్రిక్ ఇచ్చినందుకు ఆడియన్స్ కి థాంక్స్ – హీరో సుహాస్ ప్రెస్ నోట్

హ్యాట్రిక్ ఇచ్చినందుకు ఆడియన్స్ కి థాంక్స్ – హీరో సుహాస్ ప్రెస్ నోట్

Published on Feb 10, 2024 2:09 AM IST


యువ నటుడు సుహాస్ తొలిసారిగా కలర్ ఫోటో మూవీతో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం రైటర్ పద్మభూషణ్ తో మరొక విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ మూవీని దుశ్యంత్ కటికనేని తెరకెక్కించగా శివాని నగరం హీరోయిన్ గా నటించారు.

ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ తో ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. ఈ సినిమా సక్సెస్ పై తాజాగా ప్రెస్ నోట్ ద్వారా ఆడియన్స్ కి థాంక్స్ చెప్పారు సుహాస్. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కి కామెంట్స్ పెట్టడం దగ్గరి నుండి బుక్ మై షో లో టికెట్ కొనే వరకు నన్ను మీ అక్కున చేర్చుకుని ప్రేమతో నడిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.

అలానే రాబోవు చిత్రాలైన కేబుల్ రెడ్డి, ప్రసన్న వదనం, దిల్ రాజు గారు నిర్మిస్తున్న బండ్ల సందీప్ రెడ్డి ప్రాజక్ట్ లతో మిమ్మల్ని మరింత నవ్వించి ఎంటర్టైన్ చేసేందుకు త్వరలో ముందుకు రాబోతున్నాను అన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ లు అందించినందుకు థాంక్స్ అని, రాబోవు సినిమాలతో మరొక హ్యాట్రిక్ ఇస్తారని, అందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తన నోట్ లో తెలిపారు సుహాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు