డబ్బింగ్ లోకి దిగిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లేటెస్ట్ సినిమా

డబ్బింగ్ లోకి దిగిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లేటెస్ట్ సినిమా

Published on Aug 22, 2024 4:00 PM IST

దర్శకుడిగా తన సినిమాలతో టాలీవుడ్ యూత్ లో సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ కోసం తెలిసిందే. మరి తాను ఒక్క దర్శకుడు గానే కాకుండా నటుడుగా కూడా పలు చిత్రాల్లో తనదైన మార్క్ ని సెట్ చేయగా ఇప్పుడు తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ హీరోయిన్ గా కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది.

మరి ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ చిత్రం డబ్బింగ్ పనుల్లోకి అయితే దిగిపోయింది. నేడు ముహూర్త కార్యక్రమాలతో ఈ చిత్రం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసుకోగా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, బ్రహ్మానందం, శివన్నారాయణ, గోపరాజు, విజయ్, సురభి, ప్రభావతి తదితరులు నటించారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం జయ్ క్రిష్ అందిస్తుండగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్ లపై సృజన్ యరబోలు , వివేక్ కృష్ణాని,సాధిక్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు