దేవాలయ సిబ్బంది పై హీరోయిన్ అసహనం

దేవాలయ సిబ్బంది పై హీరోయిన్ అసహనం

Published on Aug 26, 2024 11:56 PM IST

నటి నమిత తాజాగా మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్లారు. ఐతే, మధుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారని నమిత ఆరోపించారు. అక్కడున్న సిబ్బందిలో కొందరు తనని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని నమిత ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నమిత మాట్లాడుతూ.. ‘కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నేను నా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లాను.

అయితే, ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకోవడం నన్ను తీవ్రంగా బాధించింది. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ చూపించమని వారు డిమాండ్ చేయడం నన్నెంతో ఇబ్బంది పెట్టాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను నేను చాలాసార్లు సందర్శించాను. ఎప్పుడు ఇలా జరగలేదు. నా పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరకుంటున్నాను’ అంటూ నమిత ఆ వీడియోలో తెలిపింది.

మరోవైపు నమిత కామెంట్స్ పై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందిస్తూ.. ‘నమితతో అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం’ అని అక్కడి అధికారులు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు