ప్రభాస్ కోసం మరోసారి విలన్‌గా మారనున్న హీరో..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, తన నెక్స్ట్ మూవీని దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ వార్ మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ‘వర్షం’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన హీరో గోపీచంద్ ఇటీవల ‘విశ్వం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ సినిమాలో విలన్ రోల్‌లో నటించాల్సి వస్తే, తప్పకుండా చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ‘ఫౌజీ’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి గోపీచంద్‌ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

అయితే, గోపీచంద్ ఇంకా తన నిర్ణయం తెలియజేయలేదట. దీంతో ప్రభాస్‌ను ఢీకొనే పాత్రలో గోపీచంద్ నటిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version