దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ తో కలిసి ‘విశ్వం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించేలా శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు.
అయితే, ఈ సినిమాలో యాక్షన్ తో పాటు వైట్ల తనదైన వింటేజ్ కామెడీ సీన్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని.. అందులో ‘వెంకీ’ మూవీ తరహా కామెడీ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ కామెడీ సీక్వెన్స్ వర్కవుట్ అయితే మాత్రం శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.