ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట !

ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట !

Published on Apr 11, 2021 11:46 AM IST

ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందని ఇప్పటికే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోలేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెడతాడని, నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బఫూన్ అవుతున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడని తెలుస్తోంది.

త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు