బాలయ్య, చిరు సినిమాలకి 6 వ షో కి అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

బాలయ్య, చిరు సినిమాలకి 6 వ షో కి అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

Published on Jan 11, 2023 12:02 AM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి (జనవరి12), మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య (జనవరి 13) లు భారీగా థియేటర్ల లో విడుదల కానున్నాయి. ఈ చిత్రాల నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ రెండు చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నాయి. ఈ చిత్రాలకు ఆరవ షో కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన జీవో ను విడుదల చేయడం జరిగింది. ఉదయం 4 గంటలకు ఈ షో మంజూరు చేసిన ప్రాంతాల్లో ప్రదర్శింప బడనుంది. ఈ రెండు చిత్రాల్లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ వీర సింహా రెడ్డి చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రాక్ స్టార్ డిఎస్పీ వాల్తేరు వీరయ్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు