‘మిర్చి, మహానుభావుడు, భాగమతి, సాహో’ లాంటి సినిమాలను రూపొందించిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. తక్కువ కాలంలోనే క్వాలిటీ సినిమాలు తీసి మంచి అభిరుచి, ఫ్యాషన్ కలిగిన సంస్థగా పేరు తెచ్చుకుంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు ఈ సంస్థ నిర్మాతలు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులుగా ఇండస్ట్రీలో మంచి పేరుంది వీళ్లకు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతోనే ఈ సంస్థ ప్రయాణం మొదలైంది.
ఇప్పుడు యూవీ అనుభంద సంస్థ గా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ని మెదలుపెట్టారు. ఈ బ్యానర్లో జనరంజకమైన కథలతో కొత్త దర్శకులు, రచయితలకి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త తరహా కథలతో సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమా అంటే ఫ్యాషన్, డెడికేషన్ కలిగిన ఏ టెక్నిషియన్ ను అయినా ఈ యూవీ కాన్సెప్ట్స్ నందు భాగస్వాముల్ని చేస్తారు. ఈ బ్యానర్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఒక చిత్రం అప్డేట్ ను రేపు అనగా మార్చి 5న సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.