వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్

Published on Aug 28, 2024 9:02 PM IST

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆర్యన్ సుభాన్ SK డైరెక్ట్ చేస్తుండగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుంది” అని అన్నారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. “కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు” అని పేర్కొన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ..”సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. మోషన్ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది” అని అన్నారు. ఈ సినిమాలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు