ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ “మట్కా”

ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ “మట్కా”

Published on Sep 12, 2024 1:08 PM IST

మెగా కుటుంబం నుంచి ఉన్నటువంటి యువ టాలెంటెడ్ హీరోస్ లో వినూత్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. మరి వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం “మట్కా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ భారీ బడ్జెట్ తో శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారట. ఈ షూటింగ్ తో సినిమా పూర్తయ్యిపోతుంది అని తెలుస్తుంది. ఇందులో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనుండగా మరిన్ని అప్డేట్స్ ముందు రానున్నాయి. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు