వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నిర్మాణం వహించనున్న ప్రముఖ సంస్థ!?

వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నిర్మాణం వహించనున్న ప్రముఖ సంస్థ!?

Published on Jul 25, 2024 5:34 PM IST

టాలీవుడ్ నటుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిసారిగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే తదుపరి ఈ హీరో మట్కా చిత్రంను చేస్తున్నారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ హీరో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు విక్రమ్ సిరికొండ, టచ్ చేసి చూడు ఫేమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. త్వరలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు