గ్రాండ్‌గా “వీక్షణం” ప్రీ-రిలీజ్ ఈవెంట్

గ్రాండ్‌గా “వీక్షణం” ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Oct 16, 2024 8:30 AM IST

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. ‘నేను మా టీమ్ వీక్షణం మూవీ గురించి ఎంతైనా చెప్పగలం. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు థియేటర్స్ లో చూసి మీరంతా చెబితే చాలా హ్యాపీగా ఫీలవుతాం. వీక్షణం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఫ్రైడే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి వీక్షణం మూవీ చూడండి.’ అని అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘వీక్షణం వంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్. మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పనిచేసి ప్రతి డిపార్ట్‌మెంట్, ప్రతి టీమ్ మెంబర్ ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశారు. ఈ శుక్రవారం వీక్షణం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్ లో మా సినిమా చూసి ఎలా ఉందో చెబుతారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

డీవోపీ సాయిరామ్ మాట్లాడుతూ..‘వీక్షణం సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ముందుగా నా డిపార్ట్‌మెంట్ లో పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. విజువల్స్ బ్యూటిఫుల్ గా వచ్చేందుకు ప్రతి ఒక్కరు తమ ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ఫ్రైడే మా వీక్షణం సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. తప్పకుండా చూడండి.’ అని అన్నారు.

హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ.. ‘వీక్షణం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా మూవీ రిలీజ్ కు వస్తుందంటే ఎగ్జైటింగ్ గా ఉంది. థియేటర్ లో మీరు ఎప్పుడు సినిమా చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. వీక్షణం టీమ్ తో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మా సినిమా చూసేందుకు థియేటర్స్ కు వచ్చేయండి. మీరు తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారు.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు