ఓటిటిలో రిలీజ్ అవుతున్న ‘వీరాంజనేయులు విహారయాత్ర’

ఓటిటిలో రిలీజ్ అవుతున్న ‘వీరాంజనేయులు విహారయాత్ర’

Published on Jul 21, 2024 12:00 AM IST

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వీరాంజనేయులు విహారయాత్ర ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథగా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు. అనురాగ్ పాలుట్ల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే స్టార్ట్ చేశారు.

ఇక ఈ సినిమాను నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ఈటీవి విన్‌లో ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ట్యాగ్ చేయడంతో ఇది ప్రేక్షకుల దృష్టిలో పడింది.

కాగా, ఈ సినిమాను భామా కలాపం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన బి.బాపినీడు మరియు సుధీర్‌లు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై కూడా సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సె‌స్‌ను అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు