రానాతో వెంకీ మల్టీస్టారర్ ఫిక్సేనా ?

రానాతో వెంకీ మల్టీస్టారర్ ఫిక్సేనా ?

Published on May 25, 2020 8:00 AM IST

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోందని.. ఈ సినిమాలో బాలయ్య బాబు అండ్ రానా కలిసి నటించబోతున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. అయితే ఈ రీమేక్ పై బాలకృష్ణ ఆసక్తి చూపించలేదట. అందుకే బాలయ్య ప్లేస్ లో వెంకటేష్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి వెంకీ – రానా ఇంట్రస్ట్ గా ఉన్నారట.

ఒరిజినల్ వర్షన్‌ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకీ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు