పొల్లాచి షెడ్యూల్ ముగించుకున్న వెంకీ-అనిల్ రావిపూడి మూవీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ మూవీ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా అదిరిపోయే ఎంటర్‌టైనర్ కథను తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పొల్లాచిలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

కాగా, తాజాగా ఈ షెడ్యూల్ షూటింగ్ ముగిసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కీలక సీన్స్ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version