మరోసారి రీ-రిలీజ్ కి రెడీ అయిన “వెంకీ”

మరోసారి రీ-రిలీజ్ కి రెడీ అయిన “వెంకీ”

Published on Sep 8, 2024 4:30 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ వెంకీ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 2004 లో థియేటర్ల లో రిలీజైన ఈ చిత్రం గతేడాది చివర్లో మళ్ళీ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మరోసారి రీ-రిలీజ్ కి అయిపోయింది.

ఈ సెప్టెంబర్ నెలలో 21 వ తేదీన మళ్ళీ థియేటర్లలోకి రాబోతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. స్నేహ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో అశుతోష్ రాణా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరోసారి రీ-రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు